పీఎం కిసాన్: అన్నదాతల ఖాతాల్లో రూ.20,500 కోట్లు జమ
NEWS Aug 02,2025 07:52 am
దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులకు ప్రధాని నరేంద్ర మోదీ శుభవార్త అందించారు. 'పీఎం కిసాన్ సమ్మాన్ నిధి' పథకంలో భాగంగా 20వ విడత ఆర్థిక సాయాన్ని శనివారం విడుదల చేశారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ పర్యటనలో ఉన్న ప్రధాని, వారణాసిలో జరిగిన ఓ కార్యక్రమంలో బటన్ నొక్కి నిధులను రైతుల ఖాతాల్లోకి బదిలీ చేశారు. ఈ విడతలో భాగంగా సుమారు 9.7 కోట్ల మంది అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా రూ.20,500 కోట్లు జమ అయ్యాయి.