ఎంపీ రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. 2014 నుంచి జరుగుతున్న ఎన్నికలపై మాకు అనుమానాలు ఉన్నాయన్నారు. ఒకే పార్టీ అన్ని స్థానాలు గెలుచుకోవడం ఏంటి అంటూ ప్రశ్నించారు. కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్కు ఒక్క సీటూ రాకపోవడం పట్ల అభ్యంతరం తెలిపారు. బీజేపీకి గంపగుత్తగా ఓట్లు పడటంపై మేం దృష్టి పెట్టామన్నారు. తమ వద్ద దగ్గర పక్కాగా ఆధారాలున్నాయని చెప్పారు. వాటి కోసం 6 నెలలు పని చేశామన్నారు. సీఈసీ తమకు ఒరిజినల్ ఓటర్ లిస్టు ఇవ్వలేక పోయిందన్నారు.