సృష్టి ఘటనతో అప్రమత్తమైంది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలోని IVF సెంటర్లపై దృష్టి సారించాలని ఆదేశించారు మంత్రి దామోదర రాజ నరసింహ. వైద్య ఆరోగ్య శాఖ తనిఖీలు చేసేందుకు రంగంలోకి దిగింది. మూడు రోజుల పాటు 35 బృందాలతో తనిఖీలు చేపట్టనుంది. ఆ తర్వాత జిల్లాల్లో తనిఖీలు చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 381 ఐవీఎఫ్ సెంటర్లు ఉన్నాయి.