తిరుమల క్షేత్రం భక్త సందోహం
NEWS Aug 02,2025 09:53 am
తిరుమల పుణ్య క్షేత్రం భక్త బాంధవులతో కొనసాగుతోంది. శ్రీవారిని 70 వేల 353 మంది భక్తులు దర్శించుకున్నారు. 25 వేల 636 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.65 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలిపారు ఈవో జె. శ్యామల రావు. స్వామి దర్శనం కోసం 6 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు కనీసం 8 గంటలకు పైగా పడుతుందన్నారు.