మాజీ మంత్రి హరీష్ రావు బనకచర్లను అడ్డుకుంటామని వార్నింగ్ ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు. బీఆర్ఎస్ నేతలు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చుపెడుతున్నారంటూ ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో రాజకీయ లబ్ది కోసం బనకచర్లపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. అన్నదమ్ముల్లాంటి తెలుగు రాష్ట్రాల మధ్య ప్రాంతీయ విభేదాలు సృష్టించే కార్యక్రమాలను తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు.