ఇకపై పాఠశాలల్లో పాలిటిక్స్ కు నో ఎంట్రీ
NEWS Aug 02,2025 07:10 am
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాల ఆవరణలోకి తల్లిదండ్రులు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు తప్ప ఏ ఇతర అనధికారిక వ్యక్తులను అనుమతించ కూడదని ఆదేశించింది. రాజకీయ పార్టీల గుర్తులు, వస్తువుల ప్రదర్శనను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.