దిగి పోయిన నాయకుడు కేసీఆర్ చెప్పినవన్నీ అబద్ధాలేనని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బాగా నమ్మిస్తే మోసం చేయడం ఈజీ అవుతుందన్నారు. నమ్మకం కలిగించే పని ఎవరు చేసినా ఆలోచించాలని అన్నారు. కమ్యూనిస్టులు పార్టీలను అధికారంలోకి తీసుకొస్తారో లేదో తెలియదు కానీ.. అధికారంలో ఉన్నవారిని దించడానికి ఉపయోగ పడతారంటూ సంచలన ఆరోపణలు చేశారు.