హోం మంత్రి అనిత తన పరిధి దాటి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. పదవి నుంచి తప్పిస్తారని అనితకు భయం పట్టుకుందన్నారు. తమనేతలపై అన్యాయంగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు. నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికెళ్లి దాడులు చేశారని మండిపడ్డారు. జగన్కు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక పోతున్నారని అన్నారు. ప్రజల్ని అడ్డుకోవడానికి పోలీసుల్ని వాడుకోవడం సిగ్గు చేటన్నారు.