ఐదో టెస్టు.. బ్యాటింగ్లో తడబడ్డ భారత్.. ఆదుకున్న కరుణ్
NEWS Aug 01,2025 09:16 am
ఓవల్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియా ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. భారత జట్టు బ్యాటింగ్ చేస్తూ తడబడింది. టాస్ గెలిచి పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకున్న ఇంగ్లండ్ పేసర్లు కట్టడిచేయడంతో భారత కీలక బ్యాటర్లంతా పెవిలియన్కు క్యూ కట్టారు. అయితే, ఈ మ్యాచ్లో శార్దూల్ ఠాకూర్ స్థానంలో జట్టులోకి వచ్చిన అతడు కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మొదట సాయితో కలిసి ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కున్న కరుణ్.. వాషింగ్టన్ (19 నాటౌట్)తో అజేయమైన ఆరో వికెట్కు 51 పరుగులు జోడించాడు.