ట్రంప్ కు శాంతి బహుమతి ఇవ్వాలి
NEWS Aug 01,2025 09:43 am
ఇండియా - పాక్ మధ్య యుద్దాన్ని ఆపినందుకు అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని అన్నారు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్. ట్రంప్ ఇప్పటి వరకు ఇండియా - పాక్, థాయిలాండ్ - కంబోడియా, ఇజ్రాయెల్ - ఇరాన్, రువాండా - డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సెర్బియా - కొసావో, ఈజిప్ట్ - ఇథియోపియా మధ్య యుద్ధాలను ఆపాడని తెలిపారు. సగటున నెలకు ఒక శాంతి ఒప్పందం లేదా కాల్పుల విరమణ చేయించాడని అందుకే పురస్కారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.