సిగాచి పరిశ్రమ ప్రమాదంపై తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఇందుకు సంబంధించి సర్కార్ కు నోటీసులు జారీ చేసింది. 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. పరిశ్రమలో ఎలాంటి భద్రతా చర్యలు చేపట్ట లేదంటూ దావా దాఖలు చేశారు బాబురావు. పేలుడు ఘటనలో ఇంకా 8 మంది ఆచూకీ లభించ లేదని పేర్కొన్నారు. ప్రమాదంపై ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక బయట పెట్టాలని కోరారు.