నా పర్యటనలపైనే ఆంక్షలు ఎందుకు..?
NEWS Jul 31,2025 03:57 pm
మాజీ సీఎం జగన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ఏ ఒక్కరు బతికే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతోందన్నారు. ప్రస్తుతం అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని కేసులు నమోదు చేసినా, జైలుపాలు చేసినా భయపడేది లేదన్నారు . అసలు నా పర్యటనలకే ఎందుకు ఆంక్షలు విధిస్తున్నారంటూ ప్రశ్నించారు.