బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం అన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. సుప్రీంకోర్టు ఇచ్చిన 3 నెలల వ్యవధి లోపల స్పీకర్ సరైన నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నామని అన్నారు. అయితే.. స్పీకర్ 3 నెలల్లో నిర్ణయం తీసుకోకపోతే ఏం అవుతుందో అనే విషయంపై ధర్మాసనం స్పష్టత ఇవ్వలేదన్నారు.