ఆంధ్రప్రదేశ్ మహిళలకు నిజంగానే శుభవార్త! స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రభుత్వం వారికి గొప్ప కానుక అందించనుంది. ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు నిన్న గుంటూరులో ప్రకటించారు. ఈ చరిత్రాత్మక నిర్ణయం లక్షలాది మంది మహిళల జీవితాల్లో పెను మార్పు తీసుకురానుంది.