సింగపూర్ టూర్ సక్సెస్.. స్వదేశానికి బయలుదేరిన మంత్రి లోకేశ్
NEWS Jul 31,2025 10:23 am
రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా సీఎం చంద్రబాబుతో కలిసి రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ చేసిన సింగపూర్ పర్యటన విజయవంతమైంది. నాలుగురోజుల పర్యటన ముగించుకొని గురువారం ఉదయం రాష్ట్రానికి బయలుదేరిన మంత్రి లోకేశ్కు అక్కడి తెలుగు ప్రవాస భారతీయులు ఆత్మీయ వీడ్కోలు పలికారు. గత ప్రభుత్వ హయాంలో సింగపూర్ కంపెనీలకు ఎదురైన చేదు అనుభవాన్ని చెరిపేసి వారిలో నమ్మకాన్ని నింపేందుకు మంత్రి చేసిన ప్రయత్నం సఫలీకృతమైంది.