సీఎంతో మీనాక్షి, టీపీసీసీ చీఫ్ భేటీ
NEWS Jul 31,2025 08:02 am
సీఎం రేవంత్ రెడ్డితో మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. పార్టీ నిర్మాణం, పాదయాత్ర, బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీలో పోరాట కార్యాచరణపై చర్చించారు. ఈ నెల 31 నుంచి వచ్చే నెల 4 వరకు యథావిథిగా కాంగ్రెస్ పాదయాత్ర జరుగుతుందన్నారు టీపీసీసీ చీఫ్. ఆగస్టు 5, 6, 7 తేదీల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లుల ఆమోదానికి ఢిల్లీలో కార్యాచరణ, 6న జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపడతామన్నారు. 7న రాష్ట్రపతిని కలిసి వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించామన్నారు.