బీజేపీలో ఖుష్బూకు మరో కీలక పదవి
NEWS Jul 31,2025 01:26 am
ప్రముఖ సినీ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూకు పార్టీలో కీలక పదవి లభించింది. ఆమెను తమిళనాడు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా నియమిస్తూ బీజేపీ నిర్ణయం తీసుకుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదంతో కొత్త రాష్ట్ర కార్యవర్గాన్ని నియమించినట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ ఒక ప్రకటనలో తెలిపారు.