ఎంపీపీ దాకవరపు నాగేశ్వరి దేవి అధ్యక్షతన బుచ్చయ్యపేట మండల పరిషత్ సర్వసభ్య సమావేశం గురువారం ఉదయం 10.30 గంటలకు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో హెచ్.బానోజీరావు తెలిపారు. కలెక్టర్ విజయకృష్ణన్ పర్యటన నేపథ్యంలో మంగళవారం నిర్వహించాల్సిన మండల పరిషత్ సమావేశం గురువారానికి వాయిదా వేశామన్నారు. మండల సమావేశానికి ఎమ్మెల్యే రాజు హాజరవుతారన్నారు. అధికారులు తమ శాఖాపరమైన పూర్తి నివేదికలతో హాజరు కావాలన్నారు.