ఆగస్టులో సీఎం రేవంత్ ఢిల్లీ బాట
NEWS Jul 30,2025 02:43 pm
సీఎం రేవంత్ రెడ్డి దేశ రాజధాని బాట పట్టనున్నారు. ఆగస్టు 5,6,7 తేదీల్లో డిల్లీలో పర్యటిస్తారు. 5 న దేశంలోని అన్ని పార్టీల అధ్యక్షులకు 42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం వినతి పత్రాలు ఇస్తారు. 6న జంతర్ మంతర్ లో రిజర్వేషన్ ల విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ సీఎం నేతృత్వంలో ధర్నా నిర్వహిస్తారు. 7న కేంద్ర మంత్రులు, ఇతర ముఖ్య నేతలను కలసి విజ్ఞప్తి చేస్తారని టీపీసీసీ వెల్లడించింది.