జగిత్యాల: ఎస్సారెస్పీకి తగ్గిన ఇన్ఫ్రా
NEWS Jul 30,2025 02:55 pm
ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం తగ్గుముఖం పడుతున్నప్పటికీ శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద కొనసాగుతోంది. బుధవారం ఉదయం 6 గంటల వరకు ప్రాజెక్టులోకి 23,950 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 1091 అడుగులు (80.5 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 1076.8 అడుగుల వద్ద 37.63 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్టు వెల్లడించారు. కాగా నిన్న లక్ష క్యూసెక్కులకు పైగా ఇన్స్లో వచ్చింది.