ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ బుధవారం ఉదయం హైదరాబాద్ లోని బషీర్బాగ్ లో ఉన్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయానికి చేరుకున్నారు. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసుకు సంబంధించి అధికారులు పంపించిన నోటీసులకు ఆయన స్పందించారు. ఇందులో భాగంగానే ఈ రోజు విచారణ కోసం అధికారుల ముందు హాజరయ్యారు. ప్రస్తుతం అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.