ఇస్రో-నాసా సంయుక్త నిసార్ ఉపగ్రహ ప్రయోగం నేడే!
NEWS Jul 30,2025 10:32 am
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) సంయుక్తంగా అభివృద్ధి చేసిన భూ పరిశీలన ఉపగ్రహం ‘నిసార్’ను నేటి సాయంత్రం 5:40 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించనున్నారు. 1.5 బిలియన్ డాలర్ల విలువైన ఈ ప్రతిష్ఠాత్మక మిషన్ భూమి ఉపరితలాన్ని పరిశీలించే విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంతో పాటు సహజ విపత్తులు, పర్యావరణ మార్పులను ట్రాక్ చేయడంలో కీలక పాత్ర పోషించనుంది.