భారత్ తో వాణిజ్య ఒప్పందం ఇంకా కుదర లేదన్నారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్. ఆగస్టు 1లోపు వాణిజ్య ఒప్పందం కొలిక్కి రాకపోతే 20 నుంచి 25 శాతం సుంకాలు విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ మాపై భారీ సుంకాలు విధించిందని ఆరోపించారు. త్వరలో 200 దేశాలకు కొత్త సుంకాల రేటు ఖరారు చేస్తామంటూ బాంబు పేల్చారు.