రేవంత్ బ్రదర్స్ పై బక్కా జడ్సన్ ఫిర్యాదు
NEWS Jul 30,2025 09:07 am
రేవంత్ బ్రదర్స్ పై సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్. దళిత, గిరిజనులపై రెచ్చి పోతున్నారని వాపోయారు. వారి భూములను కాపాడాలని మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. కొండకల్, వెలిమెల, లగచర్ల భూసేకరణలో దళిత, గిరిజనులపై అక్రమ కేసులు బనాయించారని వాపోయారు. వెలిమెలలో 429 ఎకరాల భూములను ఆక్రమించు కున్నారని ఆరోపించారు. నిరసన తెలుపుతున్న వారిపై రౌడీషీట్ కేసులు, వినకపోతే రౌడీలతో దాడులు చేయిస్తున్నారని వాపోయారు. కేసు విచారణ చేపట్టారు జస్టిస్ బిద్యుత్ రంజన్ సారంగి, విజయభారతి సయాని .