అశ్విన్ అట్లూరిపై భగ్గుమన్న బాలయ్య
NEWS Jul 30,2025 08:53 am
బాలకృష్ణ సంచలన ప్రకటన చేశారు. బంగారు బాలయ్య – బసవతారకం ఈవెంట్ పేరుతో అశ్విన్ అట్లూరి విరాళాలు సేకరిస్తున్నాడని ఆరోపించారు. ఈ ఈవెంట్ కు తాను ఎలాంటి అనుమతి ఇవ్వలేదన్నారు. హాస్పిటల్ ట్రస్ట్ బోర్డు తరపున ఎటువంటి అధికారిక ఆమోదం లేదన్నారు. ఈ రకమైన అనధికారిక, తప్పుదారి పట్టించే కార్యక్రమాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మోసపూరిత ప్రకటనలు, కార్యక్రమాలను నమ్మి మోస పోవద్దని కోరారు.