ఆ 22 మంది చిన్నారుల బాధ్యత స్వీకరించిన రాహుల్ గాంధీ
NEWS Jul 29,2025 03:45 pm
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెద్ద మనసు చాటుకున్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతల కారణంగా అనాథలుగా మారిన 22 మంది చిన్నారుల ఆలన పాలన స్వీకరించేందుకు రాహుల్ గాంధీ ముందుకొచ్చారు. ఈ 22 మంది చిన్నారులు జమ్ము కశ్మీర్ లోని పూంఛ్ జిల్లాకు చెందినవారు.రాహుల్ గాంధీ ఇటీవల సరిహద్దు గ్రామాల్లో పర్యటించారు.