సివిల్ సప్లైస్ స్కాంలో రేవంత్, ఉత్తమ్
NEWS Jul 29,2025 01:26 pm
తెలంగాణ సివిల్ సప్లైస్ స్కాంలో రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సంబంధిత అధికారులు ప్రత్యేక్షంగా పాల్గొన్నారని సంచలన ఆరోపణలు చేశారు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఓ 420 అంటూ మండిపడ్డారు. సివిల్ సప్లైస్ కుంభకోణం గురించి పార్క్ హయత్ హోటల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన మంతనాల గురించి తమ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని ప్రకటించారు. ఈ స్కాంకు సంబంధించి నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించినా స్పందించడం లేదన్నారు. ముగ్గురు చీఫ్ జస్టిస్లు మారారు కానీ సర్కార్ ఇప్పటి వరకు కౌంటర్ దాఖలు చేయలేదన్నారు.