ప్రధాని మోదీపై విరుచుకుపడిన సోనియాగాంధీ
NEWS Jul 29,2025 12:38 pm
గాజాలో ఇజ్రాయెల్ సైనిక చర్యలపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సంక్షోభంపై 'నీచమైన మౌనం' వహిస్తున్నారని ఆమె ఆరోపించారు. గాజా ప్రజలకు మద్దతుగా భారతదేశం 'స్పష్టమైన, ధైర్యవంతమైన' వైఖరిని తీసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. సోమవారం దైనిక్ జాగరణ్లో ప్రచురితమైన ఆమె వ్యాసంలో ఈ మేరకు పేర్కొన్నారు.