లులూకు 99 పైసలకే ఎకరా ఇవ్వడం దారుణం
NEWS Jul 29,2025 11:49 am
ఏపీ కూటమి సర్కార్ పై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు.రూ.కోట్ల విలువైన భూమిని లులూకు అడ్డగోలుగా ఇచ్చారని ఆరోపించారు. విశాఖలో సత్వ అనే కంపెనీకి కూడా ఇలానే కట్టబెట్టారని అన్నారు. లులూ మాల్స్లో కేవలం షాపులే ఉంటాయని, . లక్షల్లో జీతాలు వచ్చే ఉద్యోగులు ఉండరన్నారు. లులూ ఏదో పెద్ద ప్రాజెక్టులా హడావిడి చేస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడైనా ఎవరైనా ఎకరా 99 పైసలకే ఇస్తారా అని ప్రశ్నించారు.