ఆపరేషన్ సింధూర్పై నేడు పార్లమెంట్లో మాట్లాడనున్న ప్రధాని మోదీ, అమిత్ షా
NEWS Jul 29,2025 10:21 am
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై నేడు పార్లమెంటులో విస్తృత చర్చ జరగనుంది. లోక్సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాయంత్రం సమాప్తి ప్రసంగం చేయనుండగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంటల మధ్య సభను ఉద్దేశించి మాట్లాడనున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ చర్చను ప్రారంభిస్తారు. ఈ చర్చలో ఉగ్రవాద నిర్మూలన, భారత విదేశాంగ విధానం, రక్షణ వ్యూహాలపై సభ్యులు వాదప్రతివాదాలు చేయనున్నారు.