సింగపూర్ పర్యటనలో 3వ రోజు పారిశ్రామిక వేత్తలతో సీఎం చంద్రబాబు సమావేశం
NEWS Jul 29,2025 10:12 am
సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఇవాళ 3వ రోజు పారిశ్రామిక వేత్తలతో ఆయన భేటీ అయ్యారు. ఈ రోజు చంద్రబాబు పదికి పైగా సమావేశాల్లో పాల్గొనున్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫిన్టెక్ రంగాలకు చెందిన కంపెనీల ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు.క్యారియర్, విల్మర్, టీవీఎస్, మురాటా సంస్థల ప్రతినిధులతో చర్చలు జరపనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం యూట్యూబ్ అకాడమీతో ఒప్పందం చేసుకోనుంది.