తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేపట్టనున్నారు. జూలై 31న సాయంత్రం 5 గంటలకు పరిగి నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. ఆగస్టు 6న వర్దన్నపేటతో యాత్ర ముగుస్తుందని టీపీసీసీ తెలిపింది. ఈ మేరకు యాత్ర నిర్వహణ కోసం ఐదుగురిని కో ఆర్డినేటర్లుగా నియమించినట్లు పేర్కొంది.