20 ఏళ్లయినా ప్రతపక్షంలోనే - అమిత్ షా
NEWS Jul 29,2025 07:59 am
పార్లమెంట్లో అమిత్ షా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపరేషన్ సిందూర్పై లోక్సభలో కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడుతుండగా అడ్డు తగిలాయి విపక్షాలు. ఈ సందర్భంగా జోక్యం చేసుకున్నారు షా. విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ చెబుతున్నా నమ్మడం లేదని, అమెరికావి చెప్పేవి నమ్ముతున్నారంటూ మండిపడ్డారు. అందుకే ప్రతిపక్ష సభ్యులు ఆ సీట్లల్లో కూర్చున్నారని, వచ్చే 20 ఏళ్లు కూడా ప్రతిపక్షంలోనే ఉంటారంటూ కామెంట్స్ చేశారు.