పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన
NEWS Jul 28,2025 08:11 pm
పోలవరం - బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ ప్రాజెక్టు పనులను ఇంకా చేపట్టలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపిందని కేంద్రం పార్లమెంటుకు తెలియజేసింది. రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్ శక్తి శాఖ లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది.సాంకేతిక, ఆర్థిక అంచనా కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫ్రీ ఫీజిబిలిటీ నివేదికను కేంద్ర జల సంఘానికి అందించినట్లు తెలిపింది.