పామూరు మండలంలో ఎవరైనా ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ వాసుదేవరావు హెచ్చరించారు. మండలంలోని వర్గం పల్లి గ్రామంలో నాలుగు ఎకరాల 10 సెంట్ల ప్రభుత్వ భూమిలో సర్వేయర్ చేత బోర్డు ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ... ఇటీవల కొందరు అక్రమార్కులు భూములు ఆక్రమించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.