ఆపరేషన్ సింధూర్పై పార్లమెంట్లో నీటి నుంచి చర్చ
NEWS Jul 28,2025 09:52 am
భారత పార్లమెంట్లో నీటి నుంచి ఆపరేషన్ సింధూర్పై విస్తృత చర్చ జరగనుంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్థాన్లోని ఉగ్రవాద శిబిరాలపై చేపట్టిన ఈ ఆపరేషన్పై లోక్సభలో 16 గంటలు, రాజ్యసభలో మరో 16 గంటలు చర్చకు కేటాయించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చర్చను ప్రారంభించనున్నారు, అలాగే హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, మరియు ఇతర ప్రముఖ నాయకులు పాల్గొననున్నారు.