హైకమిషనర్ డాక్టర్ శిల్పక్ తో సీఎం భేటీ
NEWS Jul 28,2025 02:04 am
సింగపూర్ లో భారత హై కమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. వివిధ రంగాల్లో సింగపూర్ ప్రగతి, వృద్ధి విధానం, ప్రభుత్వ పాలసీలు, భారతీయుల కార్యకలాపాలను వివరించారు భారత్ హైకమిషనర్. ఇండియాతో సింగపూర్ ప్రభుత్వం సత్సంబంధాలను కలిగి ఉందన్నారు. గతంలో సింగపూర్తో కలిసి అమరావతి ప్రాజెక్టును చేపట్టామన్నారు సీఎం. ఏపీలో పెట్టుబడులకు అవసరమై సహకారాన్ని అందించాలని కోరారు.