మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆదివారం తిరుమలను సందర్శించారు. శ్రీవారిని దర్శించుకున్నారు కుటుంబీకులతో కలిసి. అనంతరం శ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాదం కేంద్రంలో భక్తులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్బంగా నిత్యం వేలాది మంది భక్తుల ఆకలిని తీరుస్తోందని అన్నారు. ఇదంతా ఆ దేవ దేవుడు కల్పించిన సౌకర్యం అన్నారు. ప్రతి రోజూ వందల మంది శ్రీవారి సేవకులు స్వచ్చంధంగా సేవలు అందించడం అభినందనీయమన్నారు. అన్న ప్రసాదం రుచికరంగా ఉందంటూ ప్రశంసించారు.