ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిపై 2 కేసులు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి ఇవాళ విచారణ జరిగింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు ఈ కేసును ఈ నెల 31కి వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేసింది.