ఏపీ మహిళలకు అన్ని బస్సుల్లో ఫ్రీ జర్నీ
NEWS Jul 27,2025 08:49 am
ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు సంచలన ప్రకటన చేశారు. ఉచిత బస్సు పథకం ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో అమలు చేస్తామన్నారు. మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా తమకు నచ్చిన బస్సు ఎక్కవచ్చని, ఎక్కడి నుంచి ఎక్కడికైనా నిరభ్యంతరంగా ప్రయాణం చేయొచ్చని తెలిపారు. ఈ పథకం ఏ ఒక్క జిల్లాకో పరిమితం కాదన్నారు. రాష్ట్రంలో 5 రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత జర్నీ సౌకర్యం కల్పిస్తామన్నారు.