సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
NEWS Jul 26,2025 06:01 pm
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం మల్లవరప్పాడు మాదిగ పల్లె నందు,టంగుటూరు పోలీస్ స్టేషన్ ఎస్సై నాగమల్లేశ్వరరావు మహిళలకు సైబర్ నేరగల గురించి తెలియపరిచారు. ఎవరు కూడా సెల్ ఫోన్ కి ఓటీపీ చెప్పమని అడిగితే చెప్పవద్దని, తెలియజేసారు. అలాగే టూ వీలర్ నడిపే యువకులకు హెల్మెట్ తప్పనిసరిగా వాడాలన్నరు. గ్రామాలలో ఎటువంటి అసంఘీక,కార్యకలాపాలు జరుగుతున్నా తమకు తెలియజేయాలి అన్నారు ఎస్సై నాగమల్లేశ్వరవు.