తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వరంగల్ జిల్లాలో కొత్తగా చేపట్ట బోయే మామునూర్ ఎయిర్ పోర్టు నిర్మాణానికి సంబంధించి భూ సేకరణ చేసేందుకు తక్షణమే రూ. 250 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.