డ్రోన్ నుండి క్షిపణి ప్రయోగాన్ని విజయవంతంగా పరీక్షించినట్లు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఈ పరీక్ష ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో గల నేషనల్ ఓపెన్ ఏరియా రేంజి (ఎన్ఓఏఆర్)లో జరిగింది. ఈ ప్రయోగానికి సంబంధించిన ఫొటోను ఆయన 'ఎక్స్' వేదికగా పంచుకున్నారు.