టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సీఎం చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి తొక్కిసలాట ఘటనకు సంబంధించిన నివేదికను పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆరోపించారు. తమకు అనుకూలంగా ఉన్న వారితో సాక్ష్యాలు ఇప్పించారని అన్నారు. ఈ ఘటనపై వాస్తవాలు వెలుగు చూడాలంటే వెంటనే సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తమ పార్టీకి మద్దతు ఇస్తున్నారనే నెపంతో కొందరిపై వేటు వేశారని మండిపడ్డారు.