నియోజకవర్గాల డీలిమిటేషన్ పిటిషన్ కొట్టివేత
NEWS Jul 25,2025 01:37 pm
తెలంగాణ, ఏపీలో నియోజకవర్గాల పునర్విభజన పిటిషన్ను కొట్టేసింది సుప్రీంకోర్టు. ఏపీ విభజన చట్టం సెక్షన్ 26 ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేయాలని 2022లో పిటిషన్ దాఖలు చేశారు ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి. జమ్మూ కాశ్మీర్లో పునర్విభజన చేసే సమయంలో ఏపీ విభజన చట్టాన్ని పక్కన పెట్టారని ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఈ పిటిషన్ను అనుమతిస్తే ఇతర రాష్ట్రాల వాళ్ళ పిటిషన్లు వరదల్లా వస్తాయని, అందుకే డిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటించింది.