మోదీ విదేశీ పర్యటనలు.. మూడేళ్లలో రూ.295 కోట్ల ఖర్చు
NEWS Jul 25,2025 01:30 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలకు సంబంధించి గత మూడేళ్లలో రూ.295 కోట్లు ఖర్చయిందని కేంద్ర విదేశాంగ శాఖ తెలిపింది. ఈ మేరకు గురువారం రాజ్యసభలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ఇందులో మోదీ పర్యటనలకు సంబంధించి ఏ దేశానికి వెళ్లినపుడు ఎంత ఖర్చయిందనే వివరాలను ఆయన వెల్లడించారు.