మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డికి షాక్ తగిలింది. వెంకటాచలం ఎమ్మార్వో కార్యాలయంలో ప్రభుత్వ భూ రికార్డులు తారుమారు చేశారనే కేసు నమోదైంది . పీటీ వారెంట్ పై కాకాణిని రెండోవ అదనపు మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి ఎదుట వర్చువల్ గా హాజరు పరిచారు పోలీసులు. ఇరు వాదనలు విన్న జడ్జి ఆగస్టు 7 వరకు రిమాండ్ విధించారు. కాగా ఇప్పటికే వివిధ కేసుల్లో నెల్లూరు సెంటర్ జైల్ లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.