ప్రభుత్వ పాఠశాలకు ₹10 లక్షల విరాళం
NEWS Jul 25,2025 04:21 am
ఇబ్రహీంపట్నం: వర్షకొండ గ్రామానికి చెందిన మంగిలిపెల్లి మహిపాల్ తన గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు ₹10 లక్షల విరాళం అందించారు. ఆటస్థల నిర్మాణం, పిల్లలకు ఉపయోగపడే విధంగా ఈ నిధులను వినియోగించాలని కోరారు. మహిపాల్ గతంలో ₹3 లక్షలు పిల్లల ఆట వస్తువులకు, నీటి వసతి, పెయింటింగ్ కోసం విరాళం ఇచ్చారు. గ్రామ ప్రజలు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయ భాస్కర్ మహిపాల్కు ధన్యవాదాలు తెలిపారు.