ఈడీ, ఐటీ సోదాలు జరగలేదు - ప్రీతి రెడ్డి
NEWS Jul 25,2025 07:40 am
మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు, మల్లారెడ్డి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ ప్రీతి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తమకు చెందిన ఇళ్లు, విద్యా సంస్థల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ, ఐటీ అధికారులు సోదాలు నిర్వహించినట్లు జరుగుతున్న ప్రచారం పూర్తిగా అబద్దమన్నారు. ఎలాంటి తనిఖీలు జరగలేదన్నారు. అయితే గతంలో EDకి సంబంధించిన ఓ కేసు విషయంలో వరంగల్ పోలీసులు వెరిఫికేషన్ కోసం తమ ఇంటికి వచ్చారని తెలిపారు.