అకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ
NEWS Jul 24,2025 07:50 pm
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లోని పోలీస్ స్టేషన్లో ఎస్పీ శబరీష్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలని ఎస్పీ సిబ్బందికి సూచించారు. విచారణలో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలని, రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. గంజాయి మారకద్రవ్యాల నిర్మూలనకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఎస్పీ అధికారులకు సూచనలు జారీ చేశారు.